ఇద్దరు స్నేహితులున్నారు
ఆ ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడదు
అయినప్పటికీ వారిద్దరూ ఒకరిని విడిచి ఒకరు వుండలేరు
వారి స్నేహం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది
కొట్టుకున్నా, తిట్టుకున్నా వారిద్దరే
ఓడినా, గెలిచిన వారిద్దరే
ఆఖరి మజిలి వరకు వారిద్దరూ కలిసే వున్నారు
వారిని ఎవరు విడదీయలేకపోయారు
విడదీయాలని కొందరు ప్రయత్నించారు కూడా
అయిన వారు విడిపోలేదు
అంతటి అసామాన్యులు
అయినప్పటికీ అన్ని కథల్లో లాగానే
వీరు కూడా విడిపోవాల్సిన సమయం వచ్చింది
కాని వారు బాధ పడుతూ విడిపోలేదు
సంతోషంగా విడిపోయారు
వారిని విడదీసిన క్షణానికి వారు పెట్టుకున్న
పేరు "మరణం"
వారు చనిపోయాక వాళ్ళ పేర్లు శిలాఫలకాల పై
చెక్కబడ్డాయి
ఒక శిలాఫలకం పై "ఆత్మ" అని
మరో ఫలకం పై "అంతరాత్మ " అని చెక్కారు
యుగాలు మారినా
యుగంతాలు సంభవించినా
ఆ శిలాఫలకాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండానే వున్నాయి
Monday, June 8, 2009
Subscribe to:
Post Comments (Atom)
SUPER
ReplyDeleteKEKA
ReplyDelete