వారిద్దరూ చిరకాల స్నేహితులు.
ఎంతో సఖ్యంగా ఉండేవారు.
కష్టమొచ్చినా, సుఖమొచ్చినా కలిసే పంచుకునేవారు.
ఒకరికి అవసరమొచ్చినా మరొకరు
సహాయం చేసేవారు.
అయితే వారి స్నేహం మీద ఎవరి కళ్ళు పడ్డాయో తెలియదు.
రోజు రోజుకి ఒకరి మీద ఒకరికి ద్వేషం పెరుగుతూ రాసాగింది.
ఒకరినొకరు కనీసం అర్ధం కూడా చేసుకోకుండా
స్వార్ధంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.
కనీసం మాట సహాయం కూడా చేసుకోలేని స్థితి కి దిగజారింది
వారి స్నేహం.
కాలం గడుస్తున్న కొద్ది వారి మధ్య దూరం కూడా పెరగసాగింది.
జీవితం లో ఒక మధురమైన స్నేహంగా ఆరంభమైన
వారి కలయిక ఈర్ష్యా, అసూయ వంటికి ప్రలోభాలకు
లొంగి శత్రుత్వంగా విడిపోయింది.
భావితరం కూడా చరిత్ర లో వారి స్నేహాన్ని గుర్తుపెట్టుకోలేదు.
శత్రుత్వాన్నే గుర్తుపెట్టుకుంది.
Tuesday, August 11, 2009
Subscribe to:
Post Comments (Atom)
అంతే కదండి... మంచిని మరవడం మానవ నైజం!
ReplyDelete